మాస్ సాంగ్ ను విడుదల చేసిన వీర సింహ రెడ్డి!!

నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. అఖండ సినిమా తర్వాత నటిస్తుండడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రుతి హసన్ కథానాయిక గా నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ‘జై బాలయ్య’ పాటను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడారు.  వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్ తో బాలయ్య లుక్ అదిరిపోయేలా ఉంది. ‘రాజసం నీ ఇంటి పేరు… పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ మొదలైన ఈ పాట ఆద్యంతం చాలా పవర్ ఫుల్ గా ఉంది.
థమన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అదిరిపోయే రేంజ్ లో ఉన్న ఈ పాటను చూసి బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే అని అంటున్నారు.