ధృవ్ సర్జా నటించిన “మార్టిన్” సినిమా లేటెస్ట్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 11న మైత్రీ మూవీస్ ద్వారా నైజాంలో విడుదల

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

ధృవ్ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “మార్టిన్” సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా వెలుగుతోంది. ఎ.పి. అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్‌ప్రైజెస్ మరియు ఉదయ్ కె. మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్ కె. మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మించిన ఈ సినిమా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అపారమైన స్పందన లభించింది.

ఈ ట్రైలర్ చూస్తే, “మార్టిన్” ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని లెవెల్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో ధృవ్ సర్జా యొక్క లుక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మరియు చివర్లో చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి యాక్షన్ కింగ్ అర్జున్ కథ అందించడం ఒక ప్రత్యేకత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలకు సంగీతం అందించిన ఈ చిత్రానికి, మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ట్రైలర్‌లో రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి మరొక స్థాయిని చేరుస్తుందని స్పష్టం అవుతోంది. సత్య హెగ్డే విజువల్స్ ఈ సినిమాను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లుతున్నాయి.

ఈ చిత్రం అక్టోబర్ 11న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా నైజాంలో, మరియు ఏపీ, సీడెడ్ ప్రాంతాల్లో ఎమ్‌ఎస్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ కానుంది.