న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో “ధూం ధాం” చిత్రంలోని ‘మల్లెపూల ట్యాక్సీ’ పాటను ప్రదర్శించడంతో ఎన్ఆర్ఐలు డ్యాన్సులతో హంగామా చేశారు

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ధూం ధాం. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ఈ సినిమాకు సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లేను గోపీ మోహన్ అందించారు. ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ధూం ధాం చిత్ర ప్రమోషన్స్ అమెరికాలో జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఈ సినిమాలోని ‘మల్లెపూల టాక్సీ’ పాటను ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనేక మంది ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు, పాటకు స్టెప్పులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ఈ సందడి స్థానిక అమెరికన్లను కూడా ఆకర్షించింది. ఈ నెల 12న ధూం ధాం యూఎస్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.

నటీనటులు:

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు.

సాంకేతిక బృందం:

– డైలాగ్స్: ప్రవీణ్ వర్మ

– కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని, భాను

– లిరిక్స్: సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి

– ఫైట్స్: రియల్ సతీష్

– పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్, భాను

– ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి

– ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల

– సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి

– మ్యూజిక్: గోపీ సుందర్

– స్టోరీ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్

– ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ కుమార్

– పీఆర్ ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

– ప్రొడ్యూసర్: ఎంఎస్ రామ్ కుమార్

– డైరెక్టర్: సాయి కిషోర్ మచ్చా