మహేష్ చేసిన పని.. త్రివిక్రమ్ పై ఎఫెక్ట్!!

మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వ తేదీన ఏ సినిమా ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా అప్పుడు విడుదల అవడం జరగడం కష్టం అన్నట్లుగా తెలుస్తుంది. సినిమా ఆరంభమే కొన్ని చిక్కులు ఎదురయ్యాయి.

ఒక భారీ షెడ్యూల్ లో మూవీకి సంబంధించిన యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసారు. కానీ యాక్షన్ కొరియోగ్రఫీ విషయంలో మహేష్ బాబు సంతృప్తి చెందకపోవడంతో మొదటి షెడ్యూల్ ను కుదించారు. అలా యాక్షన్ ఘట్టాలను మరోసారి చేయాల్సి వస్తుంది. దానికితోడు రెండో షెడ్యూల్ ను వెంటనే చేయాలనీ భావించిన త్రివిక్రమ్ కు మహేష్ లేకపోవడం అడ్డు కలిగిస్తుంది.

ఆయన విశ్రాంతి కోసం రెండు మూడు వారాల పాటు విదేశాలకు వెళ్లనున్నాడని సమాచారం. నవంబర్ లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అప్పటివరకూ తదుపరి షెడ్యూల్ ని చిత్రీకరించలేరు. ఇలా షూటింగ్ వాయిదా పడడం సినిమా విడుదలపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి.