‘ఖుషి’ 3 రోజుల్లో రూ.70.23 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టింది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి హల్ చల్ చేస్తోంది. యూఎస్ లో 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. 2 మిలియన్ మార్క్ కు ఖుషి పరుగులు పెడుతోంది. థియేటర్స్ డల్ గా ఉండే సోమవారం కూడా ఖుషి నైజాం, ఏపీ లోని అన్ని ఏరియాస్ లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. దీన్ని బట్టి ఈ వీక్ ఖుషికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉండే అవకాశాలున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.