డీజే టిల్లు స్టార్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా విడుద‌లైన జీ 5 ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా

ఏప్రిల్ 20, 2023: వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. త్వరలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క‌ట్టి ప‌డేసే కోర్టు రూమ్ డ్రామా ఈ లిస్టులో చేర‌నుంది. అదే ‘వ్యవస్థ’. జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు.

వ్య‌వ‌వ‌స్థ‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుద‌ల చేసింది. అందులో ఈరోజు న్యాయం రేప‌టి క్రైమ్ అయితే నేటి క్రైమ్ రేప‌టి చ‌ట్టం అవుతుంది అని ఓ లా కోర్సు ట్రైన‌ర్ త‌న స్టూడెంట్స్‌కు చెప్ప‌టంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. సంప‌త్ రాజ్ ఇందులో చ‌క్ర‌వ‌ర్తి అనే చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చేసిన‌ట్లు తెలుస్తుంది. సిటీలోని లాయ‌ర్స్ అంద‌రూ త‌న జూనియ‌ర్స్‌గా నియ‌మించుకుని వార‌పై అజ‌మాయిషీ సంపాదించ‌టం ద్వారా త‌ను చెప్పిందే జ‌రగాల‌నుకునే వ్య‌క్తిగా క‌నిపిస్తారు.

యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం ఇందులో కొన్ని నియమ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేసే మంచి మ‌న‌సున్న జూనియ‌ర్ లాయ‌ర్ వంశీ పాత్ర‌ను పోషించారు. తను న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. దీని వ‌ల్ల త‌న‌ని తాను త‌క్కువ‌గా ఊహించుకుంటుంటాడు. అయితే త‌ను హ‌త్యా నేరం మోప‌బ‌డిన యామిని అనే అమ్మాయిని కాపాడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో సిటీలోనే అతి పెద్ద లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న చ‌క్ర‌వ‌ర్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. స‌మాజంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి యామినిని కాపాడ‌టానికి ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌తాడు.

ఇందులో యామిని పాత్ర‌ను హెబ్బా ప‌టేల్ పోషించింది. తన పాత్ర అసాధార‌ణంగా ఉండ‌బోతుంద‌న‌టంలో సందేహం లేదు. అది ట్రైల‌ర్‌లో స్ప‌ష్టంగా తెలుస్తుంది. గాయ‌త్రి అనే పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ క‌నిపించ‌నుంది. లా కాలేజ్‌లోనూ కొంత క‌థ న‌డుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు తెలియ‌ని ఆస‌క్తిని పెంచే థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌న్నీ ఈ ఒరిజిన‌ల్‌లో ఉండ‌బోతున్నాయి. ఏప్రిల్ 28 నుంచి వ్య‌వ‌స్థ ఒరిజిన‌ల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

 

న‌టీన‌టులు:

వంశీగా కార్తీక్ ర‌త్నం, చ‌క్ర‌వ‌ర్తిగా సంప‌త్ రాజ్‌, యామినిగా హెబ్బా ప‌టేల్‌, గాయ‌త్రి పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ రంగ‌, నిర్మాత‌లు: ప‌ట్టాభి చిలుకూరి, ఆనంద్ రంగ‌, సినిమాటోగ్ర‌ఫీ: అనిల్ భండారి, పి.ఆర్‌.ఒ: బియాండ్ మీడియా

జీ5 గురించి:

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ఇంకా మ‌రెంతో వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందించ‌టానికి జీ 5 సిద్ధ‌మ‌వుతోంది. ఈ లిస్టులో ‘వ్యవస్థ’ త్వరలోనే చేరనుంది.