స్టెప్పులతో కుమ్మేయబోతున్న మాస్ బాస్.. ప్రోమో విడుదల!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా లోని పాటకు ముహూర్తం కుదిర్చారు. బుధవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. మంగళవారం బాస్ పార్టీ సాంగ్ ప్రోమోని చిత్ర బృదం విడుదల చేసింది.

నువ్వు ‘లిగీ కట్టుకో.. హుయ్.. నువ్వు షర్టేసుకో.. హేయ్.. నువ్వు కర్చీఫ్ కట్టుకో.. హేయ్.. బాసొస్తుండు…’ అంటూ దేవిశ్రీప్రసాద్ పాడుతున్న ఇంట్రడక్షన్ పదాలతో ప్రోమో అదిరిపోయింది.