సలార్ కోసం హాలీవుడ్ ను దించుతున్న ప్రశాంత్!!

ప్రభాస్ హీరో గా నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. ఆది పురుష్ సినిమా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంతుంది అని అనుకున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడడం అందరిని నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ తో మాట్లాడి ఈ సినిమా ముందుగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభాస్.

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కి సంబంధించి షూటింగ్ ని వేగవంతం చేశారు. కేజీఎఫ్ సినిమా తర్వాత ఈ సినిమా ను ప్రశాంత్ నీల్ వేరే స్థాయి లో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ను ఎప్పుడు వేగవంతం చేస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమా కోసం కేజీఎఫ్ స్టంట్ డైరెక్టర్స్ ను ఎంపిక చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ సినిమా లోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను ఎంపిక చేయబోతున్నారట.

త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఏదైతేనేం ఈ సినిమా ఆది పురుష్ ప్లేస్ లో విడుదల కి సిద్ధం అవుతుండడం అభిమానులను సంతోషపెడుతుంది. శృతి హాసన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వి రాజ్ ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.