రవితేజ తప్పు చేశాడా!!

ఇటీవలే హీరో లు సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాము హీరో లుగా చేస్తూ ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసే విధంగా వారు అడుగులు వేస్తున్నారు. అలా రవితేజ నిర్మాతగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా రవితేజ నిర్మాతగా మట్టి కుస్తీహ్ అనే సినిమా రాగా దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ను కొందరు తప్పు బడుతున్నారు.

తమిళ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన మట్టి కుస్తీ కి రవితేజ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. హీరోగా సక్సెస్ లు లేక ఇబ్బందులు పడుతున్న రవితేజ ఇలా నిర్మాణం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ధమాకా సినిమాలు సక్సెస్ అయితేనే రవితేజ తదుపరి సినిమాల కు బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. హీరోగా మరి కొంత కాలం రవితేజ కెరీర్ ను కంటిన్యూ చేయాలి అంటే కచ్చితంగా కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాలి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.