ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న ఈడీ విచారణ లో పాల్గొన్న విషయం తెలిసిందే. 12 గంటల విచారణ తర్వాత అయన బయటకి వచ్చి ప్రెస్ తో మాట్లాడారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ ను అధికారులు విచారించారు.

కాగా, విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు హీరో విజయ్ విలేకరులతో మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ.. పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని వ్యాఖ్యానించారు. లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ వివాదంలో ఇరుక్కుంది చెబుతున్న నేపథ్యంలో ఈ విషయమై ఆయనపై ఇలాంటి విచారణ జరిపారు.

లైగర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు.