అటుగా ఆలోచిస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్!!

ప్రస్తుతం తెలుగులో రెండు తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమైన ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే పెద్ద సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’లో సిస్టర్ గా నటించిన కీర్తి సురేష్ తెలుగులో చిరుతో కలిసి చేస్తున్న ‘బోళా శంకర్’లోనూ అదే తరహా పాత్రలో కనిపించబోతోంది.

ఇక హీరోయిన్ గా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న ‘మామన్నన్’ జయం రవి హీరోగా రూపొందుతున్న ‘సైరన్’లో తెలుగులో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’లో నటిస్తోంది. అయితే లేటెస్ట్ గా ఆమె ఓ కొత్త రూట్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.

కీర్తి సురేష్ నిర్మాణ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని ఇన్ సైడ్ టాక్. బలమైన కంటెంట్ తో కూడిన చిన్న సినిమాలని నిర్మించాలనితద్వారా కొత్త వాళ్లని ప్రోత్సహించాలని కీర్తి సురేష్ త్వరలో నిర్మాణ సంస్థని ప్రారంభించే అవకాశం వుందిన కోలీవుడ్ టాక్.